ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం సెన్సార్ పూర్తి..!

  • IndiaGlitz, [Tuesday,November 08 2016]

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. హ‌ర్ర‌ర్, ఎంట‌ర్ టైన్మెంట్, స‌స్పెన్స్...ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అంశాల‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని ఈనెల 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ - జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబినేష‌న్లో వ‌చ్చిన సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్ చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించాయి. వీరి కాంబినేష‌న్లో వ‌స్తున్న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం విజ‌యం సాధించి హ్యాట్రిక్ మూవీగా నిలుస్తుంది అని టీమ్ న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌రి...స‌రైన స‌క్సెస్ కోసం చూస్తున్న అల్ల‌రి న‌రేష్ కి ఈ చిత్రం స‌క్సెస్ అందిస్తుందేమో చూడాలి..!

More News

అఖిల్ మ్యారేజ్ ఎక్క‌డో బ‌య‌ట‌పెట్టిన చైతు..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జి.వి.కె మ‌న‌వ‌రాలు శ్రేయా భూపాల్ పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే.

'సాహసం శ్వాసగా సాగిపో' వంటి డిఫరెంట్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడం వల్ల నటుడుగా హ్యాపీగా ఉన్నాను - నాగచైతన్య

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస. మిర్యా సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు.

24 గంట‌ల్లోపే 24 ల‌క్ష‌ల వ్యూస్ క్రాస్ చేసిన ఎస్ 3 టీజ‌ర్..!

సూర్య హీరోగా రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఎస్ 3. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.

ప‌ర్ ఫెక్ట్ టైమ్ లో ధృవ ఆడియో - ఉపాస‌న‌..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంటే...విల‌న్ గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నారు.

ఆర్ పీఏ క్రియేషన్స్ , డీవీ క్రియేషన్స్ కలయికలో పిజ్జా- 2

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్.