మాజీ మంత్రి పెద్ది రెడ్డిపై బిగుస్తున్న ఉచ్చు


Send us your feedback to audioarticles@vaarta.com


జగన్ హయాంలో అన్నీ తానై వ్యవహరించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు కలిసి అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం అటవీ భూముల లెక్కలు తీస్తున్నారు. ఎస్పీ మణికంఠ, జేసే విద్యాధరి, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ భరణితో కలిసి పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల్లో సర్వే నిర్వహించారు.
దాదాపు రోజంతా సాగిన ఈ సర్వేలో పెద్దిరెడ్డి ఆధీనంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉంది, అందులో అటవీ భూముల శాతం ఎంత, ఇతర భూములు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ భూముల లెక్క తేల్చేందుకు ఏపీ సర్కారు ఇప్పటికే సంయుక్త కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం నుంచి రంగంలోకి దిగింది. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments