close
Choose your channels

కరోనా ఎఫెక్ట్: కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ వాయిదా

Monday, May 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా ఎఫెక్ట్: కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ వాయిదా

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సెకండ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అంతేకాదు.. అత్యంత సురక్షితమైన బయో బబుల్‌లో గడుపుతున్న ఐపీఎల్ క్రికెటర్లను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలపాలవగా... మరికొందరు కరోనా బారిన పడుతుండటం కలవర పెడుతోంది.

ప్రస్తుతం దేశంలో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా రెండో దశ ఉద్ధృతి తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా తాకింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ రోజు (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. కోల్‌కతా ఫ్రాంచైజీ ఆటగాళ్లు వరుణ్, సందీప్‌నకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేకేఆర్ ఫ్రాంచైజీ తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.