హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్... ఇరానీ ఛాయ్ ధరల పెంపు, కప్పు ఎంతో తెలుసా..?

  • IndiaGlitz, [Friday,March 25 2022]

ఇరానీ చాయ్... హైదరాబాద్‌కు ఎవరొచ్చినా బిర్యానీ తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేసేది దీనినే. కమ్మనైన సువాసనతో పాటు మంచి రుచి దీని సొంతం. రుచిలో మాత్రమే కాదు.. చేసే విధానం కూడా ప్రత్యేకమే. ఉస్మానియా బిస్కెట్స్, సమోసాలతో ఇరానీ ఛాయ్ తాగడాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఒత్తిడిగా వున్నా.. మనసు బాగోకపోయినా ఇరానీ ఛాయ్‌ని ఒక సిప్ చేస్తే చాలు. అయితే ఇరానీ ఛాయ్ ప్రియులకు చేదు వార్త చెప్పాయి హోటల్స్. ఈ ఇరానీ చాయ్ ధర పెంచాలని హైదరాబాద్‌లోని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. నేటి నుంచి కప్పుపై రూ.5 పెంచనున్నట్లు తెలిపాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దీంతో కప్పు టీ ధర రూ.15 నుంచి 20 రూపాయలకు చేరుకుంది. ఇరానీ చాయ్ పత్తి ధర కిలో రూ. మూడు వందల నుంచి రూ. 500కు చేరుకుంది. నాణ్యమైన పాలతో మాత్రమే సంప్రదాయ ఇరానీ ఛాయ్ చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం నాణ్యమైన పాలు లీటరు రూ. 100కు చేరగా... వాణిజ్య సిలిండర్ ధర కూడా జేబుకి చిల్లు పెడుతోంది. ఈ నేపథ్యంలోపాత ధరలకు ఇరానీ ఛాయ్‌ని విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

కాగా.. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలను కూడా పెంచిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లో రూ.15 పెరిగిన వంట గ్యాస్‌ ధర.. అప్పటి నుంచి నిలకడగా ఉంది. తాజాగా 14 కేజీల సిలిండర్‌పై ధర రూ.50 పెరిగింది. దీంతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్ ధర రూ.1,002కు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,008కు పెరిగింది. ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెరిగినట్లుగా నిపుణులు చెబుతున్నారు.

More News

ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో విషాదం.. సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.

నేపాల్‌లో భారతీయ పేమెంట్స్ సిస్టమ్.. ప్రారంభమైన ‘యూపీఐ’ సేవలు

నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.

మెగా- నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్.. హైదరాబాద్‌లో ఈ ఐదు థియేటర్లలో ‘‘ఆర్ఆర్ఆర్’’ స్పెషల్ షో, ఉ.7కి ముందే

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ‘‘ఆర్ఆర్ఆర్’’ మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండ్రోజుల్లో ఐపీఎల్ ... ధోనీ సంచలనం , చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న మహీ

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌‌కి షాక్ తగిలింది. జట్టును పలు మార్లు విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

పిల్లి వల్ల అక్షరాలా 100 కోట్ల నష్టం.. లబోదిబోమంటోన్న జనం, ఎక్కడో కాదు ఇండియాలోనే

మియావ్ మియావ్ అనుకుంటూ ఎలుకలు పట్టుకోవడానికి ఇళ్లలోకి దూరి.. సామాన్లన్నీ చిందర వందర చేసే పిల్లి అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.