మ‌హేశ్‌కు సెకండ్ హీరోయిన్ దొరికిన‌ట్టేనా?

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్.. లాక్‌డౌన్ పుణ్య‌మాని ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఖాళీ స‌మ‌యాన్నంతా గౌత‌మ్‌, సితార‌తో ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రో ప‌క్క మ‌హేశ్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట‌’ అనౌన్స్‌మెంట్ జ‌రిగింది. షూటింగ్‌కు వెళ్దామంటే.. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ త‌గ్గ‌లేదు. ఒక వైపు మ‌హేశ్ అభిమానులు ఆగ‌స్ట్ 9న మ‌హేశ్ పుట్టిన‌రోజు కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే సెకండ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌నే వార్త‌లు లేటెస్ట్‌గా సోష‌ల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

వివ‌రాల మేర‌కు.. ‘స‌ర్కారు వారి పేట‌’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటార‌ట‌. అందులో ఓ హీరోయిన్‌గా కీర్తి సురేశ్ న‌టించ‌డం ప‌క్కా అయ్యింది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ప్లేస్‌లో అన‌న్య పాండేను సంప్ర‌దించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మ‌రి ఆగ‌స్ట్ 9న మ‌హేశ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులకు ఆయ‌న ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాతే సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

More News

'కలర్ ఫోటో' టీజర్ విడుదల

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.

అక్కడ అడుగు పెట్టిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్..

ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఆయన గుజరాత్ అసెంబ్లీలో

ఆ ప‌నిచేయ‌డానికి రెండు వారాలు గ్యాప్ తీసుకున్నా:  నందితా శ్వేత‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి సినిమాల్లో దెయ్యం పాత్ర‌ల‌తో

నితిన్‌కు నో చెప్పిన పూజా హెగ్డే..?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు.