ర‌వితేజ‌కి బాలీవుడ్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

  • IndiaGlitz, [Tuesday,February 04 2020]

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను ప్లాప్‌లు పెద్ద‌గా బాధించ‌వు..క‌థ‌ను, డైరెక్ట‌ర్‌ను న‌మ్మి సినిమాలు చేయ‌డ‌మే నాకు తెలుసు అని ప‌లు సంద‌ర్భాల్లో ర‌వితేజ చెప్పుకొచ్చాడు. ట‌చ్‌చేసిచూడు, నేల‌టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని రీసెంట్‌గా డిస్కోరాజా చిత్రాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. దీంతో ర‌వితేజ సినీ మార్కెట్‌పై ఎఫెక్ట్ ప‌డుతుంది. దీంతో త‌దుప‌రి సినిమాపై మ‌రింత కేర్ తీసుకుంటున్నాడు ఈ ముదురు హీరో. ర‌వితేజ ప్ర‌స్తుతం మే 8న ప్రేక్ష‌కుల ముందుకు 'క్రాక్' సినిమాతో రానున్న సంగ‌తి తెలిసిందే. దీనికి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు.

మాస్‌రాజా త‌దుపరి సినిమా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. రాక్ష‌సుడు సినిమా స‌క్సెస్ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ తెర‌కెక్కించ‌నున్న సినిమా ఇది. అంతే కాకుండా వీర సినిమా త‌ర్వాత ర‌వితేజ‌, ర‌మేశ్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రమిది. అయితే ర‌మేశ్ వ‌ర్మ స‌హా నిర్మాత‌లు స‌క్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందుక‌ని సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందులో భాగంగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని న‌టింప చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ ఇప్ప‌టికే కియారాను అప్రోచ్ అయ్యి క‌థ‌ను కూడా వినిపించాడ‌ని స‌మాచారం. మ‌రి కియారా ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

More News

చైనా అమ్మాయితో ఇండియన్ పెళ్లి.. టెస్ట్‌లు చేయగా..!

చైనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నవి ఈ రెండే పేర్లు. ఎక్కడ చూసినా కరోనా భయం..

టీడీపీలో కాదు.. బీజేపీలోనే ఉన్నా..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో.. పలువురు టీడీపీ ఎంపీలు ‘సైకిల్’ దిగి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్: పందులను ప్రాణంతోనే పాతేస్తున్నారు!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనా వాళ్లంటే ప్రపంచమంతా హడలిపోయే పరిస్థితి నెలకొంది.

డిసెంబ‌ర్ 11న అజయ్ దేవగన్ 'మైదాన్' 

భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఫుట్ బాల్ కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

'స్టాలిన్ ' ఆడియో వేడుక

జీవా. నటించిన తాజా చిత్రం పేరు స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.