చిరంజీవికి విల‌న్ ఫిక్స్ అయ్యాడా..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్‌తో బిజి బిజీగా ఉన్నాడు. కాగా.. మ‌రో మూడు సినిమాల‌ను వ‌రుస లైన్‌లో పెట్టేసుకున్నాడు. అందులో ముందుగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’కి రీమేక్‌గా మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. దీని త‌ర్వాత త‌మిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌ను మోహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉంది. అలాగే రీసెంట్‌గా డైరెక్ట‌ర్ బాబి, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాన‌ని చిరంజీవి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో మెహ‌ర్ రమేశ్ కంటే ముందుగా బాబి సినిమానే సెట్స్‌పైకి వెళుతుంద‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమాలో విలన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు వార్త‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో శ్రుతిహాస‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌లో ఒక‌రిని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారట‌. చిరంజీవి సినిమాలను పూర్తి చేయడంలో చాలా స్పీడు చూపిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండు సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

More News

రాజ‌మండ్రిలో రామ్‌చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్

'పుష్ప' కోసం సెట్‌

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే మారేడు మిల్లి, రంప‌చోడ‌వరంల‌లో రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను

మంత్రిపై తాప్సీ ఘాటు వ్యాఖ్య‌లు

కేంద్ ప్ర‌భుత్వం కొత్త తీసుకు రావాల‌నుకుంటున్న రైతు చ‌ట్టాల‌పై పోరాటం చేస్తున్న రైతుల్లో కొంద‌రు క‌న్నుమూశారు. ఈ వ్య‌వ‌హారంపై హ‌ర్యానా వ్య‌వ‌సాయ శాఖా మంత్రి జేపీ ద‌లాల్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై

ఎగ్జ‌యిట్ అవుతున్న కీర్తిసురేష్‌..!

మ‌హాన‌టితో జాతీయ అవార్డును ద‌క్కించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్.. చాలా ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా చెప్పింది.

గ‌ట్టి పోటీ మ‌ధ్య వ‌స్తున్న నాగ్‌...!

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లోన‌టిస్తోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. సాల్మ‌న్ అహిషోర్ డైరెక్ట‌ర్‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ చిత్రం గ‌త ఏడాదిలోనే విడుదల కావాల్సింది.