కీర్తి పెళ్లి చేసుకోనుందా..?

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది. త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. అల‌నాటి అగ్ర క‌థానాయిక సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టిలో నటించి ఏకంగా జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నితిన్‌తో రంగ్ దే, సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌తో అణ్ణాత్త చిత్రాల్లోనూ న‌టిస్తుంది.

లేటెస్ట్‌గా కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోనుందంటూ గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న ఓ బిజినెస్‌మేన్‌తో కీర్తి ట‌చ్‌లో ఉంద‌ని, కీర్తి తండ్రి కూడా వారి పెళ్లి చేయ‌డానికి ఆస‌క్తి చూపాడ‌ని, కీర్తి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని త్వ‌ర‌లోనే వీరి పెళ్లికి సంబంధించిన వార్త‌ను తెలియ‌జేసే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి ఇందులో నిజానిజాలేమిటి? ఇదేమైనా రెగ్యుల‌ర్‌గా హీరోయిన్స్ పెళ్లికి సంబంధించి వ‌చ్చే వార్తేనా? లేదా అని తెలియాలంటే వేచి చూడాలి.

More News

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుప‌మ‌

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌..అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ సరికొత్త అడుగు వేయనుందా? అంటే అవున‌నే స‌మాధానం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుండి విన‌ప‌డుతుంది.

కరోనాపై పోరాటానికి బాలయ్య భారీ విరాళం.. చిరు థ్యాంక్స్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ వంతుగా ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ ఫార్ములాతో ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న 20 వ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా? అని ఎదురు చూస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ మూవీ గురించి

'మ‌హా స‌ముద్రం' అప్పుడైనా ఖ‌రార‌వుతుందా?

ఎంత క‌ష్ట‌ప‌డ్డా స‌రే! అవ‌గింజంత అదృష్టముండాల‌నే సామెత సినిమా రంగానికి ప‌క్కాగా సూట్ అవుతుంది. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తిని చూస్తూ అది నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతుంది.

క‌రోనా క్రైసిస్ లో తెలుగు సినిమా పాత్రికేయుల‌కి అండ‌గా నిలిచిన 'తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌'

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని