మ‌హేశ్ 27 దాదాపు ఖ‌రారైన‌ట్టేనా?

  • IndiaGlitz, [Monday,March 23 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమా గురించి అభిమానులు అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది త‌న 26వ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’తో భారీ హిట్ అందుకున్న మ‌హేశ్ 27వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌నుకున్నాడు. దిల్‌రాజు నిర్మాత‌గా ఆ సినిమాను నిర్మించ‌డానికి రెడీ అయిపోయాడు. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ స‌క్సెస్ త‌ర్వాత వెకేష‌న్‌కు వెళ్లి వ‌చ్చిన మ‌హేశ్, వంశీ పైడిప‌ల్లి చెప్పిన క‌థ విని న‌చ్చ‌క‌పోవ‌డంతో సింపుల్‌గా నో చెప్పేశాడు. ఇప్పుడు మ‌హేశ్ త‌న 27వ చిత్రాన్ని ఎవ‌రితో చేస్తాడ‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపించాయి.

ముఖ్యంగా మ‌హేశ్ 27 ద‌ర్శ‌కుడిగా పరుశురాం పేరు వార్త‌ల్లో విన‌ప‌డుతుంది. దాంతో పాటు మ‌రికొన్ని పేర్లు కూడా వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు దాదాపు మ‌హేష్ నెక్ట్స్ మూవీని ప‌రుశురామ్ డైరెక్ట్ చేయ‌డం ఖాయ‌మైంది. ‘గీత గోవిందం’ తర్వాత దాదాపు రెండేళ్లుగా నెక్ట్స్ సినిమా కోసం వెయిట్ చేసిన పరుశురామ్ చివరకు మహేశ్‌ని లాక్ చేసుకున్నాడ‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌తో పాటు మ‌హేశ్‌కి చెందిన జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనుంద‌ని టాక్‌. మే నెల‌లో సినిమాను లాంఛ‌నంగా ప్రారంభింస్తార‌ట‌. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2021 వేస‌విలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

More News

లెజండరీ దర్శకనిర్మాత విసు కన్నుమూత

కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు, రచయిత, స్టేజ్ ఆర్టిస్ట్‌, నిర్మాత, ద‌ర్శకుడు విసు ఇవాళ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..

ఏపీలోనూ మార్చి 31 వరకు లాక్‌డౌన్

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కీలక ప్రకటన చేశారు.

కేసీఆర్ కీలక నిర్ణయం.. మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్

కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న తరుణంలో.. వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని

డిజిట‌ల్‌లో నిర్మాత‌గా మారిన క్రిష్‌...!!

విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్‌ల‌తో చిత్రాలు చేసే ద‌ర్శ‌కుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ముందు వ‌రుస‌లో ఉంటారు. గమ్యం, వేదం, కృష్ణంవందే జ‌గ‌ద్గుర‌మ్‌, కంచె వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. ఆయ‌న సినిమాల్లో

కలకలం.. తెలంగాణ వ్యక్తికి తొలి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఈ వైరస్ భారత్‌కూ పాకడంతో పాటు..