మహేశ్‌తో ఆ డైరెక్టర్‌ సినిమా ఇక లేనట్టేనా..!?

  • IndiaGlitz, [Friday,August 23 2019]

తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఒక్క సినిమా అయినా చేయాలని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తహతహలాడిన విషయం విదితమే. అంతేకాదు.. మహేశ్‌తో ఓ మధ్యవర్తి ద్వారా మంతనాలు సైతం జరిపారట. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ సూపర్‌స్టార్‌ను పక్కనెట్టేశారట. మహేశ్‌తో సినిమా తీయాలని అందరు డైరెక్టర్స్‌కూ ఉంటుంది ఇందులో ఎటువంటి తప్పులేదు. కానీ.. ఈ డైరెక్టర్ మాత్రం హిట్ పడే సరికి ముందుగా అనుకున్న ప్లాన్ మొత్తం మార్చేసుకున్నాడట.

తెలుగులో సూపర్‌ డూపర్ హిట్టయిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ గా తర్జుమా చేయగా.. మంచి ఫలితం వచ్చింది. ఈ రీమేక్‌కు ముందు మహేశ్‌తో సినిమా చేయాలనుకున్న సందీప్.. ఆ తర్వాత మాత్రం ఆ మాటే పట్టించుకోలేదట. అయితే ఈ గ్యాప్‌లో మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజిబిజీగా ఉండటంతో సందీప్ బాలీవుడ్‌ బాట పట్టాడు.

ఇవన్నీ అటుంచితే ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ కథ కోసం ఎంతో మంది హీరోలు క్యూ కడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే బాలీవుడ్‌లో కబీర్‌సింగ్ ఏకంగా 300 కోట్ల వసూళ్ళు రాబట్టడంతో సందీప్‌కు కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తెలుగు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు సినిమా ఉన్నట్టా..? లేనట్టా..? అనేది తెలియాల్సి ఉంది.

More News

టీడీపీ నేతలకు భయం పట్టుకుంది..: కొడాలి నాని

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు అంతా అయిపోయింది..

చాయ్‌వాలాగా మారిన దీదీ.. ఎందుకిలా!?

ఇదేంటి చాయ్‌వాలా అంటే టక్కున గుర్తొచ్చేది నరేంద్ర మోదీ కదా..? దీదీ అంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..?

'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి మంచి సినిమాతో తెలుగులో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది - ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

టీమిండియా క్రికెటర్లను చంపేస్తాం!

టీమిండియా క్రికెటర్లను చంపేస్తామని ఓ యువకుడి నుంచి బీసీసీఐకి బెదిరింపు మెయిల్ వచ్చింది.

రాజ్‌తరుణ్‌ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడుగా!

టాలీవుడ్ కుర్ర హీరో రాజ్‌తరుణ్‌ కారు సోమవారం రాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.