వర్మ ట్విట్టర్ ను వదలిపోవడానికి నాగబాబే కారణమా?

  • IndiaGlitz, [Saturday,June 03 2017]

ఎప్పుడూ త‌న‌దైన కామెంట్స్‌తో, రాత‌ల‌తో ఇత‌రుల‌ను టార్గెట్ చేసేవాళ్ళ‌లో రాంగోపాల్ వ‌ర్మ ముందుంటారు. సోష‌ల్ మీడియాలో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో ఉన్న‌న్ని రోజులు వ‌ర్మను ఎవ‌రూ కంట్రోల్ చేసేవారు కాదు. ఎవ‌రినైనా ఏమైనా అనాల‌నుకుంటే వ‌ర్మకు ట్విట్ట‌రే వేదికైంది. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, నాగ‌బాబు ఇలా ఒక‌రేమిటి అంద‌రినీ వ‌ర్మ టార్గెట్ చేశాడు. అయితే ఎవ‌రికీ చెప్ప‌కుండా వ‌ర్మ ట్విట్ట‌ర్‌ను విడిచిపెట్టేశాడు. గ‌న్స్ అండ్ థైస్ టీజ‌ర్ త‌ర్వాత వ‌ర్మ ఈ ప‌నిచేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస‌లు వ‌ర్మ ట్విట్ట‌ర్‌ను ఎందుకు వ‌ద‌లివెళ్ళాడ‌నే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. అయితే వీట‌న్నింటికీ వ‌ర్మ బ‌దులిచ్చాడు.
నేను కొంద‌రిని ఇరిటేట్ చేయ‌డానికే ట్విట్ట‌ర్‌ను వాడుకున్నాను. అలా ఇరిటేట్ చేయ‌డం నాకిష్టం. ఇప్పుడు నాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అనే బొమ్మ నా చేతికి దొరికింది. మ‌ళ్ళీ ట్విట్ట‌ర్‌లోకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, నాగ‌బాబును ఇరిటేట్ చేయ‌డంపై రిగ్రెట్ అవుతున్నా. నేన‌ప్పుడు అప‌రిప‌క్వంగా ప‌నిచేశ‌నాఉ. ఎవ‌రినీ హర్ట్‌చేసే హ‌క్కు నాకు లేదు. నేను హర్ట్ చేసిన వాళ్ళంద‌రికీ సారీ. నేను ట్విట్ట‌ర్‌ను విడిచిపెట్ట‌డానికి నాగ‌బాబు కూడా ఓ కార‌ణం. ఇంత‌కు ముందులాగా ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి హ‌ర్ట్ చేయాల‌నుకోవ‌డం లేద‌ని వ‌ర్మ తెలిపారు.

More News

జూలై 7న నేచురల్ స్టార్ నాని, దానయ్య డి.వి.వి.ల 'నిన్ను కోరి'

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మేన్, మజ్ను, నేను లోకల్ వంటి వరస హిట్స్తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ టైమింగ్ క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను - అడివి శేష్

నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా "అమీ తుమీ"తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న "అమీ తుమీ" గురించి అడివి శేష్ చెప్పిన విశేషాలు..

నటుడు -దర్శకుడు పొలిచెర్ల హరనాథ్ కి పితృవియోగం

ప్రముఖ న్యూరాలజిస్టు దర్శక -నిర్మాత -నటుడు డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల తండ్రి వెంకట సుబ్బయ్య జూన్ 1 న తిరుపతి లో తుది శ్వాస విడిచారు .చీఫ్ ఇంజినీరుగా పనిచేసిన ఆయన స్ఫూర్తితోనే హరనాథ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మా ఊరి ప్రేమకథ'

మంజునాథ్ హీరోగా 'శరణం గచ్ఛామి' ఫేమ్ తనిష్క తివారి హీరోయిన్గా శ్రీమల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి.ఎమ్. దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'మా ఊరి ప్రేమకథ'.

సుధీర్ తో అమైరా...

హీరో సుధీర్ బాబు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.