close
Choose your channels

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై కోపంగా ఉన్న నాగ్ ?

Thursday, April 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై కోపంగా ఉన్న నాగ్ ?

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై టాలీవుడ్ అగ క‌థానాయ‌కుల్లో ఒకరైన నాగార్జున కోపంగా ఉన్నారా? అంటే కొంద‌రు మాత్రం అవున‌నే అంటున్నారు. అందుకు కార‌ణం ప‌రుశురామ్ చేసిన ప‌నేన‌ని వారు జ‌వాబిస్తున్నారు. ఇంత‌కు నాగార్జున‌కు కోపం వ‌చ్చేలా ప‌రుశురామ్ ఏం చేశాడు?.. వివ‌రాల్లోకెళ్తే, 2018లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీత గోవిందం సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. ఏకంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను 100 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ సాధించే హీరో క్ల‌బ్‌లో చేర్చిన చిత్ర‌మిది. అయితే వెంట‌నే ప‌రుశురామ్ స్టార్ హీరోలు త‌న‌కు ఛాన్స్ ఇస్తార‌నున్నాడు. నిజంగానే స్టార్ హీరోలు ప‌రుశురామ్‌ను క‌థ చెప్ప‌మ‌ని అన్నారు. ప‌రుశురామ్ చెప్పిన క‌థ వారికి న‌చ్చ‌లేదు. అటు మెగా క్యాంప్ హీరోలు, అప్ప‌ట్లో మ‌హేశ్ ప‌రుశురామ్‌ను హోల్డ్‌లో పెట్టేశారు. దీంతో ప‌రుశురామ్ ప‌రిస్థితి అర్థం కాలేదు.

అదే స‌మ‌యంలో ప‌రుశురామ్‌తో సినిమా చేయ‌డానికి అక్కినేని నాగ‌చైత‌న్య ముందుకొచ్చాడు. సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మై ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రిగాయి. అయితే ఈలోపు వంశీ పైడిప‌ల్లితో మ‌హేశ్ చేయాల్సిన సినిమా క‌థ న‌చ్చ‌క ఆగిపోయింది. అప్పుడు ప‌రుశురామ్‌కు మ‌హేశ్ క‌బురెట్టాడు. మ‌హేశ్ పిలిచి సినిమా చేస్తాన‌ని అన‌డంతో ప‌రుశురామ్ వెన‌కా ముందు ఆలోచించ‌కుండా చైత‌న్య సినిమాను త‌ర్వాత చూసుకుందాంలే అనుకుని వెళ్లిపోయాడు. ఇది ఓ ర‌కంగా అనైతికమే అనొచ్చు. ఈ వ్య‌వ‌హారం నాగార్జున చెవిన ప‌డ‌టంతో ఆయ‌న కోపంగా ఉన్నాడ‌ని టాక్‌. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.