పవన్ 'పింక్' రిలీజ్ ఖరారైందా?

  • IndiaGlitz, [Friday,January 17 2020]

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా 'పింక్‌'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్‌రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 20న సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

నివేదా థామ‌స్‌, అంజలి, స‌హా మ‌రో హీరోయిన్స్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య నుండి సెట్స్‌లో జాయిన్ అవుతార‌ట‌. కాగా లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాను మే 23న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. నిజా నిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.

పింక్ సినిమా ఓ కోర్టు డ్రామా. సినిమా ఎక్కువ భాగం కోర్టులోనే న‌డుస్తుంది. కాబ‌ట్టి ఈ కీల‌కమైన స‌న్నివేశాల కోసం నిర్మాత‌ల దిల్‌రాజు అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ఓ ఫ్లోర్‌ను అద్దెకు తీసుకున్నార‌ట‌. అందులో ఓ కోర్టు సెట్ వేయించ‌బోతున్నార‌ని వార్త‌లు కూడా విన‌ప‌డుతున్నాయి.

ప‌వ‌న్ రీ ఎంట్రీపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ ముందు తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌న‌ని చెప్పినా చివ‌ర‌కు ఉన్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయ‌డానికి ప‌వ‌న్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. అదీ కాక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో ఆలోపు ప‌వ‌న్ త‌న సినిమాల‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. ఈసినిమా స్క్రీన్‌ప్లేను ప‌వ‌న్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు.