నితిన్‌కు నో చెప్పిన పూజా హెగ్డే..?

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన 'భీష్మ'తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు ‘రంగ్ దే’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు నితిన్‌. దీని త‌ర్వాత బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు న‌టించిన 'అంధాదున్' సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి సోష‌ల్ మీడియాలో రోజుకొక వార్త చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ట‌బు చేసిన పాత్ర‌ను ఎవ‌రితో చేయిస్తార‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

నితిన్ స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహ‌న్‌, న‌భా న‌టేశ్ వంటి పేర్లు వినిపించాయి. ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట షికార్లు చేస్తుంది. అదేంటంటే.. యూనిట్ వ‌ర్గాలు పూజా హెగ్డేను హీరోయిన్‌గా న‌టించ‌మ‌ని సంప్ర‌దించార‌ట‌. అయితే వ‌రుస సినిమాల‌తో బిజీగాఉన్న పూజా హెగ్డే డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేన‌ని చెప్పేసింద‌ని అంటున్నారు.

More News

బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు.

ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

వినాయకచవితి వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపూ ఖైరతాబాద్ వినాయకుని వైపే ఉంటుంది.

అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసిన మోదీ..

యావత్ భారతావనికి ఉత్కంఠ భరితమైన క్షణాలివి.. శ్రీరామ నామ జపంతో దేశ మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

అయోధ్యలో భూమిపూజ.. రావణుడు పుట్టిన బిస్రాఖ్‌లో సైతం సంబరాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్..

ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో