హీరో రామ్కు జరిమానా నిజమేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. జులై 18న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇక అసలు విషయానికొస్తే.. సినిమా ప్రారంభం మొదలుకుని ఇప్పటి వరకూ చాలా వరకు వివాదాలే ‘ఇస్మార్ట్ శంకర్’ చుట్టూ తిరిగాయి. మొన్నటి వరకూ సినిమా కథ కాపీ అని.. ఆ తర్వాత కథ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఎవరో అచ్చుగుద్దినట్లుగా దింపేశారని ఇలా పలు విషయాల్లో చర్చనీయాంశమైన విషయం విదితమే.
కాగా.. ప్రస్తుతం హైదరాబాద్లో సినిమా చివరి షూటింగ్ దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో ప్యాకప్ చెప్పేస్తారని తెలుస్తోంది. ఈ తరుణంలో హీరో రామ్కు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగంగా ధూమపానం హైదరాబాద్ పోలీసులు రూ. 200 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బహిరంగ ధూమపానానికి హీరో రామ్కు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కాగా సినిమా షూటింగ్ అనంతరం చార్మినార్ వద్ద రామ్ స్మోక్ చేస్తుండగా చార్మినార్ ఎస్సై గమనించి జరిమానా విధించారు.
ఇదిలా ఉంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాపై వస్తున్న ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని.. చిత్రబృందమే ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుని వార్తల్లో నిలుస్తోందనే ఆరోపణలూ వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనేది సినిమా తెరకెక్కించిన దర్శకుడికే ఎరుక. తాజా వ్యవహారంపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.