రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ ఖ‌రారైందా?

  • IndiaGlitz, [Monday,February 24 2020]

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఈ వేస‌వికి చిత్రీక‌ర‌ణ ముగుస్తుంది. దీంతో ఈ ఇద్ద‌రు హీరోలు వారి త‌దుప‌రి సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌న్న‌ద్థ‌మవుతున్నారు. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే త‌న సినిమాను త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే.. ఏ ద‌ర్శ‌కుడితో చెర్రీ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మెగా ప‌వ‌ర్ ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర క‌థ‌లు మాత్రం ఏక‌ధాటిగానే వింటున్నాడు. కానీ ఏ విష‌యం క్లారిటీ రాలేద‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. అయితే తాజాగా రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీపై నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని టాక్‌.

వివ‌రాల్లోకెళ్తే.. 13బి, మ‌నం చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంద‌నేది టాక్‌. రీసెంట్‌గా విక్ర‌మ్ చెప్పిన క‌థ‌ను చ‌ర‌ణ్ ఓకే చెప్పాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌నేది టాక్‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ట‌. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తాడ‌ట‌. హ‌లో, గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలు ప్లాప్ అయిన త‌రుణంలో విక్ర‌మ్ కె.కుమార్‌పై న‌మ్మకంతో చ‌ర‌ణ్ సినిమా చేయ‌డ‌మ‌నేది గొప్ప విష‌య‌మే. మ‌రి గ‌త రెండు సినిమాలు ప్లాపులుగా మారిన.. ఈసారైనా విక్ర‌మ్ కుమార్ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటాడో లేదోన‌ని చూడాలి.

More News

'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పృద్వి రాజ్

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్

స‌మంత రియాలిటీ షో!!

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి.

డిఫరెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ '22' డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది.-- మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్

`పటాస్`,`సుప్రీమ్`,`ఈడో రకం..ఆడో రకం`,`రాజుగారి గది` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు స్వర సారధ్యం వహించి సినీ ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

ఛాలెంజింగ్ పాత్రలు అంటే నాకు ఇష్టం.. రాహు హీరో అభిరామ్ వర్మ

గ్రిప్పింగ్   థ్రిల్లర్ గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న రాహుల్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వేయి స్థంబాల గుడిలో కామాంధ పూజారి!

ఆడవారికి ఇంటా బయట రక్షణ లేదని.. కామాంధుల కాటుకు బలైపోతున్నారని మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం.