ర‌వితేజ నెక్ట్స్ మూవీ రీమేకా..?

  • IndiaGlitz, [Monday,August 10 2020]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ‘క్రాక్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌. ఈ సినిమా త‌ర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమా ట్రాక్ ఎక్క‌క ముందే డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశారు.‘క్రాక్’ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌, వ‌క్కంతం వంశీ సినిమాల‌ను ఒకేసారి స్టార్ట్ చేస్తారా? లేక గ్యాప్ తీసుకోకుండా ఏక‌ధాటిగా రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారా? అనేది తెలియ‌డం లేదు. వీటి మ‌ధ్య‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశారు. ‘క్రాక్’ తర్వాత ముందుగా రవితేజ.. రమేశ్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రం తమిళ చిత్రం ‘చ‌తురంగ వేట్టై’కు రీమేక్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. రీమేక్ చిత్రం ‘రాక్ష‌స‌న్’ను తెలుగులో ‘రాక్ష‌సుడు’ పేరుతో రీమేక్ చేసి స‌క్సెస్ కొట్టారు ర‌మేశ్ వ‌ర్మ‌. కాబ‌ట్టి ఈసారి కూడా ర‌వితేజ‌తో రీమేక్ అయితేనే బెట‌ర్ అని ర‌మేశ్ వ‌ర్మ భావిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నార‌ని టాక్‌.

More News

ఏడాది వెన‌క్కి వెళ్లిన ఆమిర్ ఖాన్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డుతున్నాయి. ఇప్పుడు ఈ కోవ‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చ‌ద్దా’ కూడా చేరింది.

వారి నటన నన్నెంతగానో ఆకట్టుకుంది: రామ్‌చ‌ర‌ణ్‌

సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.

సూపర్ ఫైన్‌గా ఉన్నా.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ: వర్మ

తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు వర్మ డంబెల్స్‌తో సిద్ధమై పోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో చేశారు.

సరదాగా అమ్మ కోసం.. తిడుతుందో.. బ్రహ్మాండం అంటుందో.. : చిరు

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల వేపుడు చేశారు.