సాయి తేజ్ 'రిపబ్లిక్' ఓటిటిలోకేనా?

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

సుప్రీం హీరో సాయి తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రిపబ్లిక్. విభిన్న చిత్రాల దర్శకుడు దేవకట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. అవినీతితో నిండిపోయిన వ్యవస్థపై దేవకట్టా సంధిస్తున్న మరో అస్త్రం ఈ చిత్రం. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా కరోనా ప్రభావం వల్ల ఆగింది. తాజాగా ఈ చిత్రంపై ఆసక్తికర ప్రచారం మొదలయింది. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. దీనితో ఇప్పట్లో థియేటర్స్ లో సినిమా విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో నిర్మాతలు ఓటిటి రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదీ చదవండి: 'శకుంతల'గా సమంత కరెక్ట్ కాదనుకున్నా.. ఆ రెండు ప్రాజెక్ట్స్ పక్కా!

రిపబ్లిక్ చిత్రం నిర్మాతలతో జీ నెట్వర్క్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జీ నెట్వర్క్ రిపబ్లిక్ చిత్రాన్ని పే పర్ వ్యూ తరహాలో రిలీజ్ కు ఆఫర్ చేసిందట. ఇటీవల సల్మాన్ ఖాన్ రాధే చిత్రం ఇలాగే పే పర్ వ్యూ తో విడుదలయింది. దీనిపై రిపబ్లిక్ నిర్మాతలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. మణిశర్మ సంగీత దర్శకుడు.