ప‌వ‌న్‌కు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా?

  • IndiaGlitz, [Monday,November 04 2019]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. 2018 జ‌న‌వ‌రిలో విడులైన అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా మారిపోయాడు. ఎన్నిక‌లు ముగియ‌డంతో.. ఉన్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయ‌డానికి ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయ‌న బాలీవుడ్ చిత్రం పింక్‌ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు. దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మించ‌బోయే ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. హిందీలో అమితాబ్ పాత్ర‌ను ప‌వ‌న్ పోషించ‌బోతున్నారు. హిందీలో హీరోయిన్ లేదు.

అయితే త‌మిళంలో అజిత్ స‌ర‌స‌న విద్యాబాల‌న్ హీరోయిన్‌గా చిన్న పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు అదే పాత్ర‌ను ప‌వ‌న్ పోషిస్తున్నాడు. త‌మిళంలో విద్యాబాల‌న్ పాత్ర‌కు న‌య‌నతార‌ను తీసుకోవాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ట‌. అయితే న‌య‌న‌తార చాలా బిజీ హీరోయిన్‌.. పాత్ర న‌చ్చితే చేస్తుంది. అది కూడా హై రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. మ‌రి అన్ని న‌చ్చినా డేట్స్ కుదరాలి. ఇవ‌న్నీ దాటుకుని న‌య‌న‌తార ప‌వ‌న్‌కు ఓకే చెబుతుందో లేదో చూడాలి. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఆయ‌న అభిమానుల‌కు ఆనందం క‌లిగించే విష‌య‌మే. మ‌రి డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్, ప‌వ‌న్ పాత్ర‌ను ఎలా డిజైన్ చేస్తాడోన‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

త‌మిళంలోకి రామ్‌చ‌ర‌ణ్ చిత్రం

బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమాకు భారీ విజ‌యాన్ని అందించాడు హీరో రామ్‌చ‌ర‌ణ్‌. చెర్రీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో

ప్ర‌భాస్‌కి సాహో అన‌బోతున్న సురేంద‌ర్‌

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌దుప‌రి `సాహో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

పవన్.. బాబును నమ్ముకుంటే..!: ఆమంచి సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ సక్సెస్ అయ్యింది.

విడుద‌ల‌కు సిద్ధ‌మైన సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ 'బొంభాట్‌'

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై

చాగంటితో వివాదాలపై క్లారిటీ ఇచ్చుకున్న గరికపాటి!

తెలుగు రాష్ట్రాల్లో భక్తజన అభిమానాన్ని పొందిన ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తల్లో మొదట గుర్తొచ్చేది చాగంటి కోటేశ్వరరావు,