close
Choose your channels

ఆసుపత్రికి మహేశ్, సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులు ... కృష్ణగారికి ఏమైంది...?

Monday, November 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ ఆసుపత్రి పాలైనట్లు వార్తలు రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మీడియాలో రకరకాల ఊహాగానాలు రాగా.. కృష్ణ బాగానే వున్నారని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని నరేశ్ వెల్లడించారు. అయితే కృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్న దానికి జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకుండా వుంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి మహేశ్ బాబు, సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.

ఆసుపత్రికి ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు :

రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వెళ్తే.. పరిస్ధితి ఇలా ఎందుకు వుంటుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమ అభిమాన నటుడి ఆరోగ్య పరిస్ధితిపై అసలు విషయం చెప్పాలంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. నిపుణులైన వైద్య బృందం కృష్ణ ఆరోగ్య పరిస్ధితిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కూతుళ్లు, అల్లుళ్ళు ఆల్రెడీ కాంటినెంటల్ ఆసుపత్రిలోనే ఉన్నారని తెలుస్తోంది. వైద్యులు వచ్చి చెబితేనే కానీ ఈ గందరగోళానికి చెక్ పడేలా కనిపించడం లేదు.

నరేశ్ ఇంట్లోనే కృష్ణ :

కాగా... ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే ఆయన సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్‌ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఐదేళ్ల క్రితం శ్రీశ్రీ చిత్రంలో నటించిన తర్వాత కృష్ణ సినిమాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు. కృష్ణ ప్రస్తుతం నరేశ్ ఇంట్లోనే వుంటున్నారు. మహేశ్ కూడా తరచు తండ్రి వద్దకు వెళ్లి, ఆయనతోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.