ప్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేశ్‌..?

  • IndiaGlitz, [Monday,November 11 2019]

విక్టరీ వెంక‌టేశ్ హీరోగా త‌మిళ చిత్రం 'అసుర‌న్‌' రీమేక్‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం 'అసుర‌న్‌'. ఈ సినిమాను ఇప్పుడు క‌లైపులి థాను, డి.సురేష్‌బాబు తెలుగులో నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. త‌మిళంలో వెట్రిమార‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ రీమేక్‌ను తెర‌కెక్కించేచ అవ‌కాశాలున్నాయ‌ట‌.

ప్ర‌స్తుతం వెంక‌టేశ్, చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన 'వెంకీమామ' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో క్లారిటీ రాకుండానే 'అసుర‌న్' రీమేక్‌కి వెంకీ సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే హ‌ను రాఘ‌వ‌పూడి గ‌త రెండు చిత్రాలు 'లై', 'ప‌డి ప‌డి లేచె మ‌నసు' చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంటి త‌రుణంలో హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తాడ‌నేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుందని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర నిర్మాత‌లైన క‌లైపులి థాను, సురేష్‌బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

తన ప్లానింగ్ తో అందరికి షాకిచ్చిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఇప్పుడు హిట్ మిష‌న్‌గా మారాడు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో పాటు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనూ న‌టిస్తూ అక్ష‌య్ దూసుకెళ్తున్నాడు.

క‌న్న‌డ హీరోయిన్‌తో బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఒక ప‌క్క రూల‌ర్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. మ‌రో ప‌క్క బోయ‌పాటితో సినిమాకు రెడీ అవుతున్నాడు.

క్రికెట్ షాట్‌తో ఆక‌ట్టుకుంటున్న ర‌ణ్వీర్‌ సింగ్‌

భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 ఏడాదిని మ‌ర‌చిపోలేం.  క‌పిల్ దేవ్ నాయ‌క‌త్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజ‌యాన్ని సాధించిన  క్రికెట్ విశ్వ‌విజేత‌గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించిన సంవ‌త్స‌ర‌మది.

'పిచ్చోడు' మూవీ ఫస్ట్ లుక్

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు.

'90 ఎంఎల్‌' డిసెంబ‌ర్ 5న విడుద‌ల

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన '90 ఎం.ఎల్‌` రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది.