close
Choose your channels

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేశ్‌..?

Monday, November 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేశ్‌..?

విక్టరీ వెంక‌టేశ్ హీరోగా త‌మిళ చిత్రం `అసుర‌న్‌` రీమేక్‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. ఈ సినిమాను ఇప్పుడు క‌లైపులి థాను, డి.సురేష్‌బాబు తెలుగులో నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. త‌మిళంలో వెట్రిమార‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ రీమేక్‌ను తెర‌కెక్కించేచ అవ‌కాశాలున్నాయ‌ట‌.

ప్ర‌స్తుతం వెంక‌టేశ్, చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన `వెంకీమామ` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో క్లారిటీ రాకుండానే `అసుర‌న్` రీమేక్‌కి వెంకీ సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే హ‌ను రాఘ‌వ‌పూడి గ‌త రెండు చిత్రాలు `లై`, `ప‌డి ప‌డి లేచె మ‌నసు` చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంటి త‌రుణంలో హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తాడ‌నేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుందని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర నిర్మాత‌లైన క‌లైపులి థాను, సురేష్‌బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.