ద‌స‌రా రేసు నుంచి త‌ప్పుకున్న ఇజం..!

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఆత‌ర్వాత ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయాల‌నుకున్నారు.

అయితే...ఎక్కువ సిజీ వ‌ర్క్ ఉండ‌డం, దీనికి తోడు ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న నాలుగైదు సినిమాల గుంపులో కాకుండా సోలోగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచ‌న‌తో ఇజం చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌డం లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఇజం చిత్రాన్ని అక్టోబ‌ర్ ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది..!

More News

కె.జె.ఏసుదాస్ స‌మ‌క్షంలో మ‌న‌లో ఒక‌డు పాట‌ల మిలియ‌న్ క్లిక్స్ వేడుక‌

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ  స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌రిగింది.

రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటి ఇచ్చిన హైపర్ ప్రొడ్యూసర్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్(ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

బాహుబలి 2 లోకేషన్ ఫోటోస్ లీక్..!

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి.

కోటికొక్క‌డు గా సుదీప్

ఈగ సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించిన క‌న్న‌డ స్టార్ న‌టుడు కిచ్చా సుదీప్ రీసెంట్‌గా `ముడింజ ఇన్నై పుడి` త‌మిళం చిత్రంలో హీరోగా న‌టించాడు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో `కోటిగొబ్బ‌2` అనే పేరుతో విడుద‌ల చేశారు. నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

రానా సినిమాను విడుద‌ల చేస్తున్న క‌ర‌ణ్‌ జోహార్

`బాహుబ‌లి ది బిగినింగ్` సినిమాను ద‌ర్మేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్‌లో విడుద‌ల చేసి తెలుగు సినిమా మార్కెట్‌కు హిందీలో మార్గం వేసుకునేలా దోహ‌ద‌ప‌డిన నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు రానా ద‌గ్గుబాటి హీరోగా పివిపి బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఘాజి`.