ప‌వ‌న్ 27లో ఇస్మార్ట్ బ్యూటీ..?

  • IndiaGlitz, [Monday,November 23 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ లిస్టులో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తోన్న పీరియాడిక‌ల్ మూవీ ఒక‌టి సెట్స్‌పై ఉంది. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రం..నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలంటే ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ అవ‌స‌రం. దీంతో ఎంటైర్ యూనిట్ ప‌వ‌న్ రాక‌కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. పవన్ ఈ సినిమా స్టార్ట్ చేయడానికి సమయం తీసుకుంటున్నాడు.

ప‌వ‌న్ ఈ చిత్రంలో దొంగ‌గా న‌టించ‌బోతున్నారంటూ, ఆయ‌న‌ పాత్ర గురించి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిప‌స్తున్నాయి.ఇందు‌లో హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి జాక్వలైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. కాగా.. ఇప్పుడు ఆమె స్థానంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు విరూపాక్ష‌, గజ‌దొంగ, ఓంశివమ్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయక త‌ప్ప‌దు.

More News

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

కోవిడ్ ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించ‌డం, ఫ‌లితంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చాలా న‌ష్టం జ‌రిగింది.

డ‌బుల్ డోస్ ఇస్తామంటున్న హిట్ కాంబో...

13 ఏళ్ల ముందు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం ‘ఢీ’. సరికొత్త స్టైల్లో ఫన్‌తో తెర‌కెక్కిన చిత్రం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

తమిళనాడు తెలుగు విలేకరి దారుణ హత్య

తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.

సమంత పోస్టుపై అఖిల్ కామెంట్

అక్కినేని వారి కోడలు సమంత ఓ ఫోటోని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆ పోస్టుపై ఆమె మరిది.. హీరో అఖిల్ స్పందించాడు.

రాములమ్మ మళ్ళీ ఆ పార్టీలోకి ?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మార్పు విషయమై క్లారిటీ వచ్చేసింది.