'ఇస్మార్ శంక‌ర్' వాయిదా

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుతుంది. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ సినిమాలో ఇప్ప‌టికే మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. టీజ‌ర్ కూడా విడుద‌లైంది. సాంగ్స్‌, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

జూలై 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క్రికెట్ ప్రపంచ వ‌రల్డ్ క‌ప్ పోటీల కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు.  జూలై 14న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ జ‌రగ‌నుంది. ఈ త‌రుణంలో ప్రేక్ష‌కులు క్రికెట్‌ను చూసి ఆస్వాదించ‌డానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. ఇది బాక్సాఫీస్‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి  చిత్ర యూనిట్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్పుడు సినిమా విడుద‌ల జూలై 12న కాకుండా జూలై 18న విడుద‌ల కానుంది.

More News

నిర్మాత దిల్‌రాజుకు సీఎం వైఎస్ జగన్‌ కీలక పదవి!

టైటిల్‌ చూడగానే తెలంగాణకు చెందిన దిల్‌రాజుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడమేంటి..?

టీటీడీ 50వ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్‌ నేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్..

ట్రాఫిక్‌కు భ‌య‌ప‌డ్డ నితిన్ ఏం చేశాడంటే!!

హీరో నితిన్ త‌న కొత్త సినిమా `భీష్మ‌` చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తొలి రోజు చిత్రీక‌ర‌ణ ముగిసిందో లేదో.. కానీ కొత్త స‌మ‌స్య స్టార్ట్ అయ్యింది నితిన్‌కి.

'సాహో' సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`.

విజ‌య్‌, అట్లీ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

`తెరి`, `మెర్స‌ల్‌` వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది.