'ఇస్మార్ శంకర్' వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. సాంగ్స్ చిత్రీకరణ జరుతుంది. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. టీజర్ కూడా విడుదలైంది. సాంగ్స్, టీజర్కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.
జూలై 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ పోటీల కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. జూలై 14న వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. ఈ తరుణంలో ప్రేక్షకులు క్రికెట్ను చూసి ఆస్వాదించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది బాక్సాఫీస్పై ఎఫెక్ట్ పడుతుందని `ఇస్మార్ట్ శంకర్` దర్శక నిర్మాతలు భావించి చిత్ర యూనిట్తో చర్చలు జరిపారు. ఇప్పుడు సినిమా విడుదల జూలై 12న కాకుండా జూలై 18న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.