వందేళ్లకోసారి మాత్రం ఇలాంటి వర్షం పడే అవకాశం: కేటీఆర్

  • IndiaGlitz, [Monday,October 19 2020]

1908లో మూసీకి వరదలు వచ్చాయని.. నాడు ఒకే రోజు 43 సెంటీమీటర్లు వర్షం పడిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సగటున ఏటా 78 సెం.మీ. వర్షం పడుతోందని, ఈ ఏడాది ఇప్పటికే 80 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. నగర చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమని కేటీఆర్ తెలిపారు. వందేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. క్యుములోనింబస్ మేఘాలతో ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షం పడుతోందన్నారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని, వేలాది మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.

రాబోయే మూడు రోజులు మరింత వర్షం కురిసే అవకాశం ఉందని కేటీఆర్ వెల్లడించారు. 80 మంది సీనియర్ అధికారులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటారని తెలిపారు. వీరంతా ప్రాణ నష్టం జరగకుండా చూస్తారన్నారు. పునరావస కేంద్రాల్లో భోజనం, వైద్య సేవలు అందిస్తామని.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కిట్ అందిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.60 కోట్లు ఖర్చు చేశామని... ఇంకా 670 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పటికీ కొన్ని కాలనీలతో పాటు అపార్టుమెంట్లలో నీరు నిలిచి ఉందని కేటీఆర్ తెలిపారు.

వరద సహాయక చర్యల కోసం బోట్లను సైతం అందుబాటులో ఉంచినట్టు కేటీఆర్ తెలిపారు. ఆర్మీకు సమాచారం అందించామని.. హెలికాఫ్టర్లను సైతం సిద్ధంగా ఉంచామన్నారు. పునరావాస కేంద్రాల్లో కరోనా టెస్టులు కూడా చేస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. వారి కోసం సామాజిక భవనాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. మొబైల్ టాయిలెట్లను కూడా అందుబాటులో ఉంచాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో వరదల కారణంగా 70 మంది మృతి చెందారని కేటీఆర్ తెలిపారు. కాగా.. ఇంతవరకూ కేంద్రం స్పందించలేదన్నారు.

More News

ఆ ట్వీట్‌ని బ్రహ్మాజీ ఎందుకు డిలీట్ చేశారు?

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అభిమానుల ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు.

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు.

నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' ఈ నెల 24న విడుదల

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్..

కరోనా వైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

'క‌ల‌ర్ ఫొటో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా