close
Choose your channels

విశాల్ మూవీ మెయిన్ పాయింట అదేనంట...

Wednesday, June 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో సినిమాల‌ను నిర్మిస్తూ, న‌టిస్తున్న విశాల్ ఇప్పుడు మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో `తుప్ప‌రివాల‌న్` అనే మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాల‌తో పాటు మిత్ర‌న్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇరుంబు తిరై` అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ స‌ర‌స‌న స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.
ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న డిజిట‌ల్ నేరాల‌పైనే సాగుతుంద‌ట‌. సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. విశాల్ ఈ సినిమాతో పాటు వెల్లైరాజా క‌రుప్పు రాజా సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. న‌డిగ‌ర్ సంఘం సెక్ర‌ట‌రీగా, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా రాణిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.