కాజ‌ల్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి

  • IndiaGlitz, [Sunday,June 17 2018]

‘చందమామ’ సినిమాతో కాజల్ అగర్వాల్‌కు తొలి విజయాన్ని అందించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. 2007లో వచ్చిన ఆ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారాయ‌న‌. ఆ త‌రువాత ఏడేళ్ళకు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా కోసం ఈ ఇద్ద‌రు మ‌రోసారి క‌లిసి ప‌నిచేశారు. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

క‌ట్ చేస్తే.. నాలుగేళ్ళ విరామం త‌రువాత ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రాబోతోంద‌ని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. గ్రామీణ నేప‌థ్యంలో అంతా కొత్త‌వారితో కృష్ణవంశీ ఓ లవ్ స్టొరీని తెరకెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం కాజ‌ల్‌ను సంప్ర‌దించార‌ట కృష్ణ‌వంశీ. త‌న‌కు బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో.. కాజ‌ల్ కూడా ఈ క్యారెక్ట‌ర్ చేసేందుకు అంగీకారం తెలిపింద‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

More News

ర‌జ‌నీ కొత్త చిత్రం అప్‌డేట్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ క‌థానాయ‌కుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అంజలి టైటిల్ పాత్ర‌లో కోన పిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి. సినిమా కాంబినేష‌న్‌లో 'గీతాంజ‌లి 2'

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి'..

దిల్ రాజు చేతుల మీదుగా శంభో శంకర 3వ పాట విడుదల

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

రెండు పేర్ల‌తో ఎన్టీఆర్‌

ఈ విజ‌య‌ద‌శ‌మికి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది.

చిరుతో ముచ్చ‌ట‌గా మూడోసారి

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ళ గ్యాప్ త‌రువాత హీరోగా న‌టించిన చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.