close
Choose your channels

ఐదేళ్లయ్యింది.. ఏం చేసావో చెప్పు?: కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్

Sunday, November 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐదేళ్లయ్యింది.. ఏం చేసావో చెప్పు?: కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సారి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు.
ఒక్కసారి అవకాశం ఇస్తే వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇళ్లను తొలగిస్తామని అమిత్ షా తెలిపారు. గుడ్ గవర్నెన్స్‌ను అమలు చేస్తామని.. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా పేదలకు కార్పోరేట్ వైద్యం దూరం చేశావని కేసీఆర్‌ను విమర్శించారు. జాతీయ రహదారులు నిర్మించామని.. పీఎం స్ట్రీట్ వెండర్ యోజన స్కీం ద్వారా మూడు లక్షల మంది లబ్ది పొందారని అమిత్ షా వెల్లడించారు.

కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం..

‘‘హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? ప్రధాని మోదీ ఏం చెప్తే అది చేస్తాడు.. ఐదేళ్ళు అయ్యింది.. ఏం చేసావో చెప్పు..? సిటిజన్ చాప్టర్ ఏమైంది? లక్ష ఇల్లు ఏమయ్యాయి? మూసీ నదిపై ఆరు లైన్ల రోడ్ ఏమైంది? 15 డంప్ యార్డులు ఏమయ్యాయి? పదివేల కోట్ల ఖర్చు ఎక్కడ చేశావు? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఏమైంది? ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు నాలుగు ఆసుపత్రులు కడతానన్నావ్ ఏమయ్యాయి? మజ్లీస్‌తో కలిస్తే మాకేం ఇబ్బంది లేదు.. కానీ గుప్తంగా ఎందుకు? మీ కుటుంబం మినహా ఇంకెవరూ లేరా? ’’ అంటూ కేసీఆర్‌పై అమిత్‌ షా ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇంట్లో కూర్చొని సీట్లు పంచుకుంటావు..

వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఎనీవేర్ పద్ధతిని మోదీ తీసుకొచ్చారని అమిత్ షా కొనియాడారు. దీని ద్వారా హైదరాబాద్ యువతకు లబ్ది దక్కిందన్నారు. స్టార్టప్ కోసం ప్రత్యేక నిధులు ఇచ్చారని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, హైదరాబాద్ మినీ భారత్.. హైదరాబాద్‌కు నిజాం కల్చర్ నుంచి బయట వేసి కొత్తనగరం నిర్మిస్తామన్నారు. డైనెస్టీ నుంచి డెమోక్రసీ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తామన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంట్లో కూర్చొని సీట్లు పంచుకుంటావని విమర్శించారు. ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే రోహింగ్యాలను తరిమికొడతానన్నారు. కేవలం అమ్మవారి దర్శనం కోసమే వచ్చానని అమిత్ షా వెల్లడించారు. ఏ ఎన్నికలనూ ఈజీగా తీసుకోబోమన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.