close
Choose your channels

‘జాను’ హిట్.. కాలినడకన తిరుమలకు చిత్రబృందం

Sunday, February 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘జాను’ హిట్.. కాలినడకన తిరుమలకు చిత్రబృందం

యంగ్ హీరో శర్వానంద్, సమంత నటీనటులుగా సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన రీమేక్ చిత్రం ‘జాను’. జనవరి-07న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగానూ గట్టిగానే సంపాదించి పెట్టింది. మరీ ముఖ్యంగా విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషమని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన జనాలంతా సామ్ ఇరగదీసిందంతే అంటూ కితాబిచ్చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఆదివారం నాడు చిత్ర బృందం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామివారిని చిత్రబృందం దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత నిర్మాత దిల్ రాజు, సమంత, శర్వానంద్‌తో పలువురు చిత్రసభ్యులు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ, తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హిట్ కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. మా ఈ ‘జాను’ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని.. సినిమాలో శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారన్నారు. కాగా దిల్‌రాజు తన తదుపరి చిత్రం ‘పింక్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.