చిరు ఇంటిని ముట్టడించట్లేదు.. : జేఏసీ క్లారిటీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును.. మూడు రాజధానులను నిరసిస్తూ 70 రోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ సంచలన ప్రకటన చేసింది. చిరంజీవి ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించింది. అయితే రేపే ఈ ముట్టడి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో జేఏసీ స్పందించి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చుకుంది. అమరావతి పరిరక్షణ సమితి పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము పిలుపునివ్వలేదని అమరావతి జేఏసీ కన్వీనర్‌ గద్దె తిరుపతి రావు మీడియా ముఖంగా వెల్లడించారు.

అదంతా ప్రచారమే..!

‘సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. చిరంజీవి ఇంటిని ముట్టడికి మేం ఎలాంటి పిలుపు ఇవ్వలేదు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇదివరకే సూపర్ స్టార్ మహేశ్‌ బాబును విద్యార్థి సంఘాలు ముట్టడించడం.. అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఓ వైపు హైదరాబాద్ పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. అయితే తాజా ఈ ప్రకటన అంతా ఉత్తుత్తే అని తేడంతో మెగాభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. వారిని కఠినంగా శిక్షించాలని మెగాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

More News

చిరు-కొరటాల మూవీలో బాలీవుడ్ నటుడు కీలకపాత్ర!

మెగాస్టార్ చిరంజీవి త‌న‌ 152వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను ఆగ‌స్ట్ 14 లేదా 15న

నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం

యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం

'రెడ్' టీజ‌ర్: రాపో డ‌బుల్ ధ‌మాకా ల‌వ్ థ్రిల్ల‌ర్ ట్రీట్

క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ కి స‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌కం. అస‌లేం జ‌రుగుతోంది? అన్న‌ది ముందే రివీల్ కాకూడ‌దు. ఆడియెన్ ఊహ‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌బ‌ట్టి కుర్చీ అంచున

అసలు పేరుతో.. పవర్ ఫుల్ లుక్‌లో కలెక్షన్ కింగ్

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య హీరోగా గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.

మార్చి 4న పాయల్ రాజ్‌పుత్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

తెలుగులో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. తొలి తెలుగు చిత్రం 'ఆర్ఎక్స్ 100', తర్వాత 'ఆర్‌డిఎక్స్ లవ్'తో గ్లామర్