జగన్ నిర్ణయం వివాదమే.. చిత్తశుద్ధి ఉంటే.. పవన్

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో 1251 ఎకరాల్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయి. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుంది. ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు!

‘జగన్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలి. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారు. రాజధాని గ్రామాలలోనే కాకుండా జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు నెలకొని ఉన్నాయి. అసైన్డ్ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని వెల్లడిస్తోంది’ అని పవన్ తెలిపారు.

More News

వెంకటేశ్ విడుదల చేసిన సముద్ర 'జైసేన' ట్రైలర్

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో

మార్చి 2 న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్

'అర్జున' ట్రైలర్ విడుదల

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు.

నాగ‌శౌర్య సినిమా ఆగిపోలేదు: నిర్మాత‌లు

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కాంబినేష‌న్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై ఓ సినిమా కొన్ని రోజుల ముందు స్టార్ట్ అయ్యింది.

క‌వ‌ల‌లుగా బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం మార్చి నుండి ప్రారంభం కానుంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.