పోలవరం తర్వాత జగన్ మరో షాకింగ్ నిర్ణయం!

  • IndiaGlitz, [Tuesday,September 17 2019]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకుని ఇప్పటివరకూ అన్ని సంచలన, కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇందుకు ఆయన వందరోజుల పాలనే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జగన్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే.. పోలవరం కాంట్రాక్టును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో జరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. కాగా.. ఈ పనుల విలువ రూ.1,031.17 కోట్లు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు దీంతో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను కూడా తక్షణమే ఆపేయాలని జగన్ సర్కారు నిలిపివేసిందని తెలుస్తోంది. కాగా.. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

More News

టీటీడీ పాలకమండలి సభ్యులు ఖరారు.. జగన్ సమన్యాయం!

టీటీడీ చైర్మన్‌గా వైసీపీ సీనియర్, వైఎస్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పాలకమండలి సభ్యులను పెండింగ్‌లో పెట్టిన సర్కార్.. మంగళవారం నాడు

నిర్మాత పివిపి అకౌంట్‌లో గోల్ మాల్‌.. మేనేజ‌ర్‌పై కేసు న‌మోదు ?

ప్ర‌ముఖ సినీ నిర్మాత పి.వి.పి బ్యాంకు ఖాతా నుండి ప‌ది కోట్ల రూపాయ‌లు గ‌ల్లంతైన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పి.వి.పి ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌గా చెప్పుకునే భాను ప్ర‌కాశ్ అనే వ్య‌క్తే ఈ మొత్తాన్ని

మోదీ బ‌యోపిక్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ప‌లు రంగాల్లోని కీల‌క వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ కోవ‌లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. అ

కోడెల మృతిపై చంద్రబాబు, బాలయ్య ఆవేదన!

టీడీపీ కీలకనేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సైరా ప్రిరీలీజ్ ఈవెంట్ వాయిదా..!?

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే తొలిసారిగా ‘సైరా’ అనే చారిత్రక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.