హిందీ సినిమా సీక్వెల్‌లో జ‌గ‌ప‌తిబాబు

  • IndiaGlitz, [Wednesday,July 04 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ అయిన స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ కూడా బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ అయింది. ఆ త‌రువాత అదే సినిమాకి ద‌బాంగ్ 2 పేరుతో సీక్వెల్ వ‌చ్చింది. అది కూడా మంచి విజ‌యం సాధించింది. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు దబాంగ్ మూడో భాగం రూపొందుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌తినాయ‌కుడిగా రాణించిన జ‌గ‌ప‌తిబాబు హిందీలో కూడా ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి. ఇటీవ‌ల రంగ‌స్థ‌లంలో ఆయ‌న పోషించిన ప్ర‌తినాయ‌కుడి పాత్రకి మంచి పేరు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

More News

రంగ‌స్థ‌లం విడుద‌ల తేదిన సైరా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సైరా న‌రసింహా రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా..

జి. ఎస్.కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర చిత్రం ప్రారంభం

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా 'అడ్డా, ఓటర్' చిత్రాల దర్శకుడు జి. ఎస్. కార్తీక్ దర్శకత్వంలో

'తేజ్ ఐల‌వ్ యు' చాలా పెద్ద హిట్ అవుతుంది - అల్లు అర‌వింద్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు

షూటింగ్ పూర్తి చేసుకున్న త్రినేత్రి, త్వరలోనే టీజర్ విడుదల

ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణం లో  లక్షిత ఆర్ట్స్ పతాకం పై తిరుపతి కె వర్మ దర్శకత్వం లో ఎడవెల్లి వెంకట్ రెడ్డి మరియు కాచిడి గోపాల్ రెడ్డి నిర్మాతలుగా నిర్మించబడుతున్న చిత్రం త్రినేత్రి.

సూర్య చిత్రంలో విల‌న్‌గా ఆర్య‌

వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత త‌మిళ స్టార్ హీరో సూర్య, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో