close
Choose your channels

'జై సింహా' .. సెకండాఫ్ హైలైట్ అట

Thursday, January 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలకృష్ణ, నయనతార హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం జై సింహా`. నటాషా దోషి, హరిప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్ర నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “బాలకృష్ణ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు, అలాగే కథను విన్న వెంటనే ఈ సినిమాలో నటించడానికి నయనతార కూడా ఒప్పుకున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటాయి. మ‌రీ ముఖ్యంగా ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే పతాక సన్నివేశాలు మూవీకే హైలైట్. ఆ సన్నివేశాలను చాలా చక్కగా తెరకెక్కించారు దర్శకుడు రవికుమార్” అని పేర్కొన్నారు. అలాగే బాలకృష్ణ చెప్పే డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్తాయని సమాచారం. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.