భూటాన్ లో జక్కన్న...

  • IndiaGlitz, [Saturday,April 29 2017]

ఐదేళ్ళ ప్ర‌యాణం ఏప్రిల్ 28న 'బాహుబ‌లి 2' విడుద‌ల‌తో పూర్త‌య్యింది. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొడుతుంది. సినిమా విడుద‌ల త‌ర్వాత తాను కొన్ని రోజుల పాటు హాలీడే ట్రిప్ తీసుకుంటాన‌న్న రాజ‌మౌళి అన్న మాట ప్ర‌కార‌మే బాహుబ‌లి 2కు హిట్ టాక్ రావ‌డంతో ట్రిప్ కోసం ఫ్యామిలీతో క‌లిసి భూటాన్ చెక్కేశాడ‌ట‌.
త‌న త‌దుప‌రి సినిమా గురించి ఏం ఆలోచించ‌లేదు. ట్రిప్ త‌ర్వాతే ఆలోచిస్తానని చెప్పిన జ‌క్క‌న్న ఓ యంగ్ హీరో కోసం లైన్‌ను సిద్ధం చేసి ఉన్నాడ‌ట‌. ట్రిప్ త‌ర్వాత త‌న త‌దుప‌రి చిత్రం గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అయితే జ‌క్క‌న్న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభార‌తం సినిమాను మాత్రం ప‌దేళ్ళ త‌ర్వాతే తెర‌కెక్కిస్తాడ‌ట‌. మ‌హాభారతాన్ని సినిమాగా తెర‌కెక్కించే శ‌క్తి, నైపుణ్యం ఇప్పుడు త‌న‌కు లేవ‌నేది రాజమౌళి అభిప్రాయం.