జమ్మూ-కాశ్మీర్ను మూడు ముక్కలు చేసిన మోదీ సర్కార్
Send us your feedback to audioarticles@vaarta.com
జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం ఇందుకు సబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయాన్ని రాజ్యసభలో హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ ఉన్న జమ్మూ-కాశ్మీర్ మూడు ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూ, కాశ్మీర్, లఢక్ అనే మూడు ప్రాంతాలుగా మోదీ సర్కార్ విడగొట్టేసింది.!. దీంతో కాశ్మీర్ స్వయంప్రతిపత్తి కోల్పోయినట్లయ్యింది.
కాగా.. ఇక నుంచి జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరు చట్టసభలు ఉండనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రెండోసారి ప్రధాని పీఠమెక్కిన తర్వాత మోదీ జమ్మూ-కాశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చేశారని చెప్పుకోవచ్చు. ఢిల్లీ తరహాలోనే ఇక జమ్మూ, కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిగణించబడతాయి. అంతేకాదు.. పార్లమెంట్లో చేసిన ప్రతి చట్టం ఇక జమ్మూలో అమలు కానుంది. అయితే లడఖ్కు మాత్రం చట్టసభలుండవు.
లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రజలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా ‘షా’ రాజ్యసభలో చెప్పుకొచ్చారు. ఈ ఆర్టికల్ రద్దును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించి గెజిట్ విడుదల చేశారు. మొత్తమ్మీద చూస్తే మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రద్దు వ్యవహారాన్ని ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతేకాదు కశ్మీర్లో మళ్లీ రచ్చ రచ్చ జరిగే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. మరి మన్ముంధు పరిస్థితలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.