Gudipudi Srihari : పాత్రికేయ దిగ్గజం గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. ఆయన రివ్యూలు గీటురాయిలా వుండేవి : పవన్ దిగ్భ్రాంతి

  • IndiaGlitz, [Tuesday,July 05 2022]

సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతిపై జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ మంగళవారం పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘పాత్రికేయ రంగంలో... ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన గుడిపూడి శ్రీహరి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి గారు రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు.

55 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం.. భార్య మరణంతో ఒంటరి:

కాగా.. సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గతవారం ఇంటిలో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో శ్రీహరిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీని నుంచి కోలుకున్నప్పటికీ .. ఇతర అనారోగ్య సమస్యలతో శ్రీహరి ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. విదేశాల్లో వున్న కుమారుడు శ్రీరామ్ భారత్ కు రాగానే శ్రీహరి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గుడిపూడి సతీమణి లక్ష్మీ గతేడాది నవంబర్ లో మరణించారు. ఈ దంపతులకు ఓ అబ్బాయి, ఒక అమ్మాయి వున్నారు. 55 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఈనాడు సహా ప్రముఖ తెలుగు దినపత్రికల్లో శ్రీహరి పనిచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యఘట్టాలు, విశేషాలకు సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని గుడిపూడి రచించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

More News

Janasena Party : ఏపీకి వైసీపీ హానికరం.. ముద్దులు పెట్టేవాళ్లని నమ్మొద్దు : జనవాణిలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను పాలకులు గుర్తుంచుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

RK Roja : మోడీ సభలో సందడంతా ఆమెదే : ప్రధాని , సీఎం, చిరంజీవితో సెల్ఫీ తీసుకున్న రోజా.. ఫోటోలు వైరల్

మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఘనంగా జరిగాయి.

Janasena Party : దోచుకోవడం , దాచుకోవడం.. ఎదురు తిరిగితే బ్లాక్‌మెయిలింగ్ : వైసీపీ పాలనపై పవన్ విమర్శలు

జనవాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ఎక్కువగా వ్యవసాయం , గృహ నిర్మాణం , విద్య మీదే వచ్చాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Janasena Party : ‘‘ముద్దుల మావయ్య’’నంటూ వంచన.. పిల్లలు చనిపోతున్నా పట్టదా : జగన్‌పై పవన్ ఆగ్రహం

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

కేఆర్ క్రియేషన్స్ పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం

హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి