NTR Satha Jayanthi: ఆయనో అభ్యుదయవాది.. ఎన్టీఆర్‌కు పవన్ కల్యాణ్ ఘన నివాళులు

  • IndiaGlitz, [Saturday,May 28 2022]

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్.టి.రామారావు కూడా ఒకరని ప్రశంసించారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన అభ్యుదయవాదిగా ఎన్.టి.ఆర్. నిలిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు.

అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నానని అన్నారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు తనను ఎంతగానో ఆకట్టుకునేదని.. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్.టి.రామారావు జయంతి సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అంజలి ఘటిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తెలుగు జాతి కీర్తి కిరీటం : ఎన్టీఆర్‌కు మెగాస్టార్ నివాళి

అటు అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ‘‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చిరంజీవి:

ఇకపోతే.. అన్నగారితో చిరంజీవికి మంచి అనుబంధమే వుంది. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కలిసి నటించారు కూడా. ‘తిరుగులేని మనిషి’ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ నుంచి ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాన‌ని చిరంజీవి ప‌లు సంద‌ర్భాల్లో తెలియజేశారు. అలాగే చిరంజీవి మామ‌య్య‌.. ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య‌కు సైతం ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి - సురేఖల నిశ్చ‌తార్థానికి కూడా ఎన్టీఆర్ హాజరయ్యారు.

More News

RK Roja : ఆయనంటే భయం.. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి తరిమేశారు : చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైరయ్యారు.

Green Bawarchi Hotel : రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. లోపల చిక్కుకుపోయిన 20 మంది

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాయదుర్గంలోని ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సజ్జల ఏం చెప్పారో.. మంత్రుల నోటా అదే, అంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే: జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ

రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి కాచుకుంటోందని ఆరోపించారు జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ .

Ladakh Accident : మాటల కందని విషాదం.. లఢఖ్ ప్రమాదంలో సైనికుల దుర్మరణంపై పవన్ దిగ్భ్రాంతి

లఢఖ్‌ వద్ద బస్సు నదిలో దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం పాలైన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం

''ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు.