తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన, షెడ్యూల్ ఇదే

  • IndiaGlitz, [Thursday,May 19 2022]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏపీపైనే ఫోకస్ పెట్టిన ఆయన తెలంగాణలోనూ కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా ఈ నెల 20న (రేపు) ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ రానున్నట్లు జనసేన నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మేకల సతీష్‌ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తూ.. మార్గమధ్యంలో చౌటుప్పల్‌లో పవన్ ఆగుతారని ఆయన చెప్పారు. వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన పార్టీ కార్యకర్త సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఈ క్రమంలోనే అతని భార్య, పిల్లలను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి చౌటుప్పల్‌లో జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హుజూర్‌ నగర్‌కు చెందిన జన సైనికుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారని సతీశ్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా లక్కారం గ్రామాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన ఇన్‌ఛార్జి మేకల సతీష్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి గురువారం రాత్రి సందర్శించారు. ఇక్కడి జనసేన కార్యకర్తలతో సమావేశమై పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

ఇకపోతే.. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శిరివెళ్ల గ్రామంలో కౌలు రైతులను పరామర్శించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా వారికి పార్టీ తరపున రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు.

More News

ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అపశృతి : శిల్పకళావేదికలో ప్రమాదం, ఐబీ అధికారి మృతి

హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది.

కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ.. ఉలిక్కిపడ్డ కోలీవుడ్, టాలీవుడ్

తమిళ అగ్ర కథానాయకుడు, ఇళయ దళపతి విజయ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

కోట్లు విలువ చేసే కారు కొన్న ‘పాగల్ ’ హీరో.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ..!!

అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్ కార్యక్రమం వివాదానికి దారి తీసినా సినిమా మంచి విజయం సాధించడంతో హీరో విశ్వక్ సేన్ సక్సెస్ జోష్‌తో వున్నారు.

పద్మశ్రీ వనజీవి రామయ్యకు యాక్సిడెంట్ .... ఐసీయూలో ట్రీట్‌మెంట్, ఆందోళనలో అభిమానులు

మొక్కలు పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

తత్త్వం బోధపడినట్లుందిగా.. ‘ఎఫ్ 3’కి టికెట్ రేట్లు పెంచనన్న దిల్‌రాజు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది.