close
Choose your channels

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్

Saturday, May 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కరోనా బారినపడిన పవన్‌కు ప్రత్యేక వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని ప్రకటనలో వెల్లడించారు. అయితే కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని తెలిపారు. ‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు కోలుకున్నారు. కరోనా బారిన పడిన పవన్ కల్యాణ్‌గారికి వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.

Also Read: పుట్ట మధు అరెస్ట్.. ఈటల అనుచరులే టార్గెట్?

కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని.. ఆరోగ్యపరంగా శ్రీ పవన్ కల్యాణ్ గారికి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియజేశారు. తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్‌గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు’’ అని జనసేన పార్టీ తన ప్రకటనలో వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.