close
Choose your channels

వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు

Friday, August 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్‌లు ఇస్తున్నారంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. పార్టీ మీద ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడినా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ పైనా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ వేదికగా ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారంపై శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకి జనసేన పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాటిచ్చారన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుల వారి వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ.. "కొందరు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద అబాండాలు వేస్తున్నారు. అధ్యక్షుల వారి సూచన మేరకు కొంత సంయమనం పాటించాం. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు స్థాయిని దాటిపోతున్నాయి. వారు ఎలాంటి ఊహల్లో ఉన్నారో దాన్ని ప్రచారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల మధ్యకి వెళ్తున్న పార్టీని మొగ్గలోనే తుంచేయాలన్న దురుద్దేశంతో బర్త్ డే సందర్భంగా రూ. 2 వేల కోట్లు బ్లాక్ మనీని వైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా అధికారిక పేజీ ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఇక మీదట జనసేన పార్టీ మీద ఇలాంటి దుష్ర్పచారాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది" అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.