close
Choose your channels

జనసేన తరఫున పోటీదారులకు ఆహ్వానం...

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన తరఫున పోటీదారులకు ఆహ్వానం...

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు అధిష్టానం ఆహ్వానం పలికింది. శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి స్వీకరించే దరఖాస్తు (బయో డేటా) నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమోదం తెలియచేసింది. మంగళవారం విజయవాడ పార్టీ ఆఫీసులో పవన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశమైంది. ఈ సమావేశంలో దరఖాస్తు నమూనా, పరిశీలన ప్రక్రియ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన చేసే స్క్రీనింగ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులో ఎటువంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు లాంటి అంశాలపై పీఏసీ చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సిన విధివిధానాలను కూడా ఖరారు చేయడం జరిగింది. దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాలని స్క్రీనింగ్ కమిటీకి పీఏసీ సూచించింది. స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియచేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ విధివిధాలను ప్రకటించారు.

తొలి బయోడేటా సమర్పించిన సేనాని

2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్షన్‌లో లోక్‌స‌భ‌, అసెంబ్లీల‌కు జ‌న‌సేన పార్టీ త‌ర‌పున‌ పోటీ చేయాల‌నుకునే అభ్యర్ధులు వారికి సంబంధించి బ‌యోడేటాల‌ను మాదాసు గంగాధ‌రం గారి నేతృత్వంలో ఏర్పడిన స్క్రీనింగ్ క‌మిటీకి స‌మ‌ర్పించాల‌ని జనసేనాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తొలిగా త‌న బ‌యోడేటాని స్క్రీనింగ్ క‌మిటీకి స‌మ‌ర్పించారు. ఇప్పటి నుంచి బ‌యోడేటాల స్వీక‌ర‌ణ ప్రక్రియ మొద‌లైన‌ట్టు తెలిపారు. 2009 అనుభ‌వాల దృష్ట్యా డ‌బ్బు అనే అంశానికి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా, నిబద్దత, క‌ష్టప‌డేత‌త్వాన్ని బట్టి అభ్యర్ధుల్ని నిర్ణయించ‌డం జ‌రుగుతుంద‌నీ, ఇందులో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు ఉండ‌వ‌ని చెప్పారు. అభ్యర్ధులు కూడా ప‌క్క మార్గాల‌కు వెళ్లకుండా బ‌యోడేటాను నేరుగా క‌మిటీకి ఇవ్వాల‌నీ, ప‌రిశీల‌నాధికారం ఒక్క క‌మిటీకి మాత్రమే ఉంద‌నీ స్పష్టం చేశారు. స్క్రీనింగ్ క‌మిటీకి బ‌ల‌మైన నిర్దేశిత సూత్రాలు ఇచ్చాన‌ని, అందుకు అనుగుణంగానే ప‌రిశీల‌న ప్రక్రియ ఉంటుంద‌ని తెలిపారు. జ‌న‌సేన అభ్యర్ధులు బ‌యోడేటాలు స‌మ‌ర్పించేందుకు ఈ ఐదుగురు స‌భ్యుల క‌మిటీ మాత్రమే ఉంది. ద‌య‌చేసి వారికే బ‌యోడేటాలు ఇవ్వాల‌ని స్పష్టం చేశారు.

తెలంగాణ పార్లమెంటరీ కమిటీలు నియామకం

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాలకు పార్లమెంటరీ కమిటీలను నియమించిన పవన్ తాజాగా తెలంగాణలోని అయిదు లోక్ సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ పార్లమెంటరీ కమిటీలపై చర్చించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.