close
Choose your channels

వ్యక్తిగత విమర్శలొద్దు.. ‘‘చెత్తపుత్రుడు’’ అనాల్సి వస్తుంది: మంత్రి అమర్‌నాథ్‌కు జనసేన నేత బొలిశెట్టి వార్నింగ్

Tuesday, April 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఫైరయ్యారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్య బొలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం మీ అమ్మగారు ప్రయత్నించారని ఆరోపించారు. మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు గట్టిగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. మంత్రిగా ప్రస్థానం మొదలుపెట్టిన వెంటనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావంటూ సత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి వచ్చిన రెండో రోజే అమర్‌నాథ్ తన శాఖ గురించి మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని .. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నారని ఫైర్ అయ్యారు.

జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 2018లోనే తెగతెంపులు అయ్యాయని.. పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ చర్యలను ఎండగట్టారని సత్య బొలిశెట్టి గుర్తుచేశారు. టీడీపీ నుంచి మీ కుటుంబం వైసీపీకి వెళ్ళిందని.. సంబంధాలు, బంధాలు అన్నీ మీకే తెలుస్తాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుల మీటింగుల్లో గంటలు గంటలు స్పీచ్ ఇవ్వడం.. కుల ఆత్మగౌరవాన్ని ఒకరి కాళ్ల వద్ద తాకట్టు పెట్టి మంత్రి పదవులు పొందడం మీకే చెల్లిందన్నారు. కులానికి మీరు ఏదో చేసిన గొప్ప మహానుభావుళ్లలాగా మాట్లాడొద్దని.. మిమ్మల్ని గుడివాడ గుర్నాథరావు చెత్తపుత్రుడు అని పిలవాల్సి వస్తుందని సత్య హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో 87 వేల మంది రైతులు రుణాలను ఎగ్గొట్టారని .. అప్పుడు మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో వుండి ఏం చేశారని బొలిశెట్టి ప్రశ్నించారు. రైతులకు టీడీపీ హయాంలో నష్టం జరిగితే మీరు చేసిన పోరాటం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ నాయకుడి చరిత్ర అంతా నేరపూరితమని.. వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన కొడుకు జగన్ చంపాడని నిండుసభలో చెప్పిన బొత్స సత్యనారాయణను మంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బాబాయ్ బాత్రూంలో హత్యకు గురైతే ఇప్పటివరకు దానిమీద నిజం బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు, రక్తపూరిత రాజకీయాలు మీకు తెలిసినంతగా మాకు తెలియవన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించే గుణం మా అధినేతకు మాత్రమే వుందని.. దానికి మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము మీ కంటే దారుణంగా మాట్లాడతామని బొలిశెట్టి హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.