janasena : పవన్‌కు భయపడుతున్నారు.. అందుకే ఈ కుయుక్తులు: జనసేన నేత తాతారావు

  • IndiaGlitz, [Tuesday,June 21 2022]

తాము చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక తాజా, మాజీ మంత్రులతో ప్రభుత్వం విమర్శలు చేయిస్తుందని మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు . విశాఖపట్నం ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా పవన్ కళ్యాణ్ ప్రభంజనాన్ని అడ్డుకోలేదన్నారు. అధికారం చేతిలో ఉన్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితమైతే... ఏ అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని తాతారావు పేర్కొన్నారు.

పవన్ పాపులారిటీ చూసి ప్రభుత్వం భయపడుతుంది:

పవన్ కళ్యాణ్‌కి పెరుగుతున్న జనాదరణ చూసి తాజా మంత్రులు జోగి రమేష్ , అంబటి రాంబాబుతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులను గుర్తించి, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోందని తాతారావు దుయ్యబట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ ఒక్కరే చేయడంతో వైసీపీ నాయకులు అభద్రత భావానికి గురవుతున్నారని మండిపడ్డారు.

లీటరుకు టీఎంసీలకు తేడా తెలియని వాళ్లు మాట్లాడుతున్నారు:

లీటరుకు టీఎంసీలకు తేడా తెలియని అంబటి కూడా పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మంత్రి పదవి ఊడిపోయినా ఇంకా మంత్రినే అనే భ్రమలో పేర్ని నాని ఉన్నారంటూ తాతారావు సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని తాతారావు ఫైరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన ఎవరితో ముందుకు వెళ్తుంది? ఒంటరిగా వెళ్తుందా? పొత్తులు పెట్టుకుంటుందా? అనేది మా అధినేత చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. దానిపై వైసీపీ నాయకులు మదనపడాల్సిన అవసరం లేదన్నారు.

మీరు అనుకునే స్థిరత్వం మాకు చేతకాదు:

పవన్ కళ్యాణ్‌కి స్థిరత్వం లేదని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని... 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజలకు ఇసుక దొరక్కుండా చేయడమే స్థిరత్వమా అని తాతారావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను మోసగించడం స్థిరత్వమా అని ఆయన నిలదీశారు. మద్యపాన నిషేధమని చెప్పి... దానిపై వచ్చిన ఆదాయాన్నే గ్యారెంటీలుగా చూపించి అప్పులు తెచ్చుకోవడం స్థిరత్వమా అని తాతారావు మండిపడ్డారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి జేబులు నింపుకోవడం స్థిరత్వమా? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దోచేయడం స్థిరత్వమా అని ఆయన ప్రశ్నించారు. ఇవే వైసీపీ దృష్టిలో స్థిరత్వం అయితే తమ అధినేతకు ఎన్నటికీ చేతకావని తాతారావు చురకలు వేశారు.

More News

AP High Court: ఆన్‌లైన్ సినిమా టికెట్లు... జగన్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు, వివాదం మళ్లీ మొదటికేనా..?

ప్రజలకు వినోదం అందుబాటులో వుండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.

"చోర్ బజార్" కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ - దర్శకుడు జీవన్ రెడ్డి

"దళం", "జార్జ్ రెడ్డి" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "చోర్ బజార్".

Pic Talk : క్రాప్ టాప్‌లో సమంత హాట్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్ డోసు బాగా పెంచారు సమంత. ఫ్రెండ్స్‌తో పిక్నిక్‌లు, హాట్ ఫోటో షూట్‌, ట్రెండీ వేర్‌లతో ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా లో పోటా పోటీ గా జరిగిన అట సయ్యంది పాదం సెమి ఫైనల్ డ్యాన్స్ పోటీలు

జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ D.Cలో జరగనున్న 17వ ATA కన్వెన్షన్‌ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో

ZEE5 'పులి-మేక' పేరుతో కొత్త వెబ్ సిరీస్‌ ప్రారంభం

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తుంది..ZEE5 ప్రారంభం నుండి ఒక ప్రముఖ