janasena : రైతుల గురించి ఆ మాటలేంటీ.. సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే : జనసేన నేత మధుసూదన్ రెడ్డి

  • IndiaGlitz, [Tuesday,June 21 2022]

కౌలు రైతులను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరణించిన కౌలు రైతుల కుటుంబాలతో కలసి ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టి.సి.వరుణ్‌తో కలిసి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి బాధల్లో ఉన్న కుటుంబాలను రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి... హేళనగా మాట్లాడం సబబు కాదన్నారు.

మరణించిన కౌలు రైతులకు రూ.7 లక్షలు పరిహారం చెల్లించాలి:

ముఖ్యమంత్రి జగన్ కౌలు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకపోగా వారి మరణాలను అవమానించేలా మాట్లాడటం భావ్యం కాదని హితవు పలికారు. సీఎం మాట్లాడిన తీరు చాలా హేయంగా ఉందని.. ప్రభుత్వం చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్ ఒక్కరే చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులను గుర్తించి వారికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి, జిల్లా నాయకులు ఆకుల ఉమేష్, సాకే పవన్ కుమార్, పొదిలి బాబురావు, జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

More News

janasena : పవన్‌కు భయపడుతున్నారు.. అందుకే ఈ కుయుక్తులు: జనసేన నేత తాతారావు

తాము చేపట్టిన  కౌలు రైతు భరోసా యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక తాజా, మాజీ మంత్రులతో ప్రభుత్వం విమర్శలు చేయిస్తుందని మండిపడ్డారు

AP High Court: ఆన్‌లైన్ సినిమా టికెట్లు... జగన్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు, వివాదం మళ్లీ మొదటికేనా..?

ప్రజలకు వినోదం అందుబాటులో వుండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.

"చోర్ బజార్" కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ - దర్శకుడు జీవన్ రెడ్డి

"దళం", "జార్జ్ రెడ్డి" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "చోర్ బజార్".

Pic Talk : క్రాప్ టాప్‌లో సమంత హాట్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్ డోసు బాగా పెంచారు సమంత. ఫ్రెండ్స్‌తో పిక్నిక్‌లు, హాట్ ఫోటో షూట్‌, ట్రెండీ వేర్‌లతో ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా లో పోటా పోటీ గా జరిగిన అట సయ్యంది పాదం సెమి ఫైనల్ డ్యాన్స్ పోటీలు

జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ D.Cలో జరగనున్న 17వ ATA కన్వెన్షన్‌ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో