close
Choose your channels

CPI Narayana : ‘‘ గడ్డి తింటున్నట్లున్నాడు.. కాస్త అన్నం పెట్టండి, మనిషవుతాడు ’’ : సీపీఐ నారాయణకు నాగబాబు కౌంటర్

Wednesday, July 20, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు చిరంజీవికి సైతం ఆహ్వానం అందింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మెగాస్టార్‌ను పిలవడాన్ని సీపీఐ నారాయణ తప్పుబట్టారు. సూపర్‌స్టార్ కృష్ణను పిలవకుండా ఊసరవెల్లి, చిల్లర బేరగాడి లాంటి చిరంజీవిని ఆహ్వానించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పనిలో పనిగా చిరు సోదరుడు పవన్ కల్యాణ్‌పైనా సీపీఐ నారాయణ విమర్శలు చేశారు. పవన్ ఓ మందుపాతర లాంటివాడని.. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా, జనసేన అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో నారాయణపై విమర్శలు చేశారు.

చిరు, పవన్ కల్యాణ్‌లకు మద్ధతుగా నాగబాబు:

తాజాగా తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు మద్ధతుగా నాగబాబు రంగంలోకి దిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వాటిలో ఆయన ఏమన్నారంటే.. ‘‘‘ ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు’’.

మనిషిలా మారాలంటే కాస్త అన్నం పెట్టండి:

‘‘ కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి .. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’’ అంటూ నాగబాబు ధీటుగా బదులిచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.