close
Choose your channels

పవన్‌ను మరోసారి టార్గెట్ చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

Monday, June 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్‌ను మరోసారి టార్గెట్ చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన పార్టీ అధినేత, పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి టార్గెట్. జనసేనను పట్టించుకునేవారే లేరని.. పార్టీకి అధ్యక్షుడు మాత్రమే ఉన్నారని కేడర్ లేదని తెలిపారు. చిరంజీవికి పవన్‌కు చాలా తేడా ఉందన్నారు. చిరు అందరితో కలిసి ఉండేవారని కానీ పవన్ జనాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తాను తొలుత వైసీపీ టికెట్ కోసం యత్నించగా దక్కలేదని.. ఆపై జనసేన నేతలు వచ్చి తమ పార్టీ తరుపున పోటీ చేయాలని కోరారని వెల్లడించారు.

వైసీపీ చేస్తున్న మంచి పనుల కారణంగానే తాను ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నానని రాపాక తెలిపారు. పవన్‌ని నాదెండ్ల మనోహర్ రాంగ్ రూట్‌లో నడిపిస్తున్నారని తన విషయంలోనూ అదే జరిగిందన్నారు. జనసైనికుల్ని ఉద్దేశించి కూడా రాపాక పరోక్ష విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఉన్నవారు పార్టీ విజయానికి సహకరించరని.. మరొకరిని తిట్టేందుకు మాత్రమే పనికొస్తారన్నారు. తనపై సోషల్ మీడియా వేదికగా గుప్పిస్తున్న విమర్శలను పట్టించుకోబోనని రాపాక స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.