పవన్‌ను మరోసారి టార్గెట్ చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

  • IndiaGlitz, [Monday,June 29 2020]

జనసేన పార్టీ అధినేత, పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి టార్గెట్. జనసేనను పట్టించుకునేవారే లేరని.. పార్టీకి అధ్యక్షుడు మాత్రమే ఉన్నారని కేడర్ లేదని తెలిపారు. చిరంజీవికి పవన్‌కు చాలా తేడా ఉందన్నారు. చిరు అందరితో కలిసి ఉండేవారని కానీ పవన్ జనాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తాను తొలుత వైసీపీ టికెట్ కోసం యత్నించగా దక్కలేదని.. ఆపై జనసేన నేతలు వచ్చి తమ పార్టీ తరుపున పోటీ చేయాలని కోరారని వెల్లడించారు.

వైసీపీ చేస్తున్న మంచి పనుల కారణంగానే తాను ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నానని రాపాక తెలిపారు. పవన్‌ని నాదెండ్ల మనోహర్ రాంగ్ రూట్‌లో నడిపిస్తున్నారని తన విషయంలోనూ అదే జరిగిందన్నారు. జనసైనికుల్ని ఉద్దేశించి కూడా రాపాక పరోక్ష విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఉన్నవారు పార్టీ విజయానికి సహకరించరని.. మరొకరిని తిట్టేందుకు మాత్రమే పనికొస్తారన్నారు. తనపై సోషల్ మీడియా వేదికగా గుప్పిస్తున్న విమర్శలను పట్టించుకోబోనని రాపాక స్పష్టం చేశారు.

More News

తెలంగాణ లొకేష‌న్స్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి ఆరా!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ టెన్ష‌న్‌కు కార‌ణం క‌రోనా.

భీమవరం టాకీస్ ద్వారా త్వరలో OTT ప్రారంభం!

మారుతున్న టెక్నాలజీ తో మనం మారుదాం, సినిమా జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త మార్గాన్ని వెలికితీశారు.

ఎస్.జానకి ఆరోగ్యంపై వదంతులు.. వివరణనిచ్చిన కుటుంబ సభ్యులు

భారతీయ ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి గురించి ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి.

అలీ హీరోగా నటిస్తోన్న 53వ చిత్రం ‘మా గంగానది’ ట్రైల‌ర్ విడుద‌ల‌

అలీ, నియా హీరో హీరోయిన్లుగా ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మూకాంబికా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.బాల నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య కూడా తీవ్ర స్థాయిలో నమోదవుతోంది.